
న్యూఢిల్లీ: సూపర్ మార్కెట్ చెయిన్ విశాల్ మెగా మార్ట్లో 10 శాతం వాటాను కంపెనీ ప్రమోటర్ సమాయత్ సర్వీసెస్ ఎల్ఎల్పీ బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించనుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఈ డీల్ విలువ రూ. 5,057 కోట్లు ఉంటుందని, ఒక్కో షేరుని రూ. 110 కి అమ్మనున్నారని తెలిపారు. కంపెనీ షేర్లు సోమవారం రూ.124 దగ్గర ముగిశాయి. దీంతో పోలిస్తే 13 శాతం తక్కువకు షేర్లను సమాయత్ అమ్మనుంది. కిందటేడాది డిసెంబర్లో మార్కెట్లోకి బంపర్ ఎంట్రీ ఇచ్చిన విశాల్ మెగా మార్ట్, ఈ ఏడాది జనవరి– మార్చి క్వార్టర్లో రూ. 115.1 కోట్ల నెట్ ప్రాఫిట్ సాధించింది. గత ఏడాది ఇదే టైంలో వచ్చిన రూ. 61.2 కోట్లతో పోలిస్తే ఇది 88 శాతం ఎక్కువ. గత ఆరు నెలల్లో ఈ కంపెనీ షేర్లు దాదాపు 12 శాతం లాభపడ్డాయి.