మంచిర్యాలలో వ్యాక్సినేషన్ సెంటర్ ని పరిశీలించిన వివేక్

మంచిర్యాలలో వ్యాక్సినేషన్ సెంటర్ ని పరిశీలించిన వివేక్

మంచిర్యాల జిల్లా ఏరియా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ సెంటర్ ని పరిశీలించారు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ తో కలిసి ఆయన వ్యాక్సినేషన్ సెంటర్ కు వెళ్లారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ధర్డ్ వేవ్ ని సమర్దవంతంగా ఎదుర్కోవచ్చనే ఉద్దేశంతోనే.. ప్రధాని మోడీ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశారని చెప్పారు.  దూరంగా ఉన్నవారు వ్యాక్సినేషన్ సెంటర్ కు వచ్చేందుకు కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా ఆటోలతో రవాణా సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు.