వాట్సాప్ వాడని వారితో చాట్ చేసేందుకు.. త్వరలో గెస్ట్ చాట్ ఫీచర్

వాట్సాప్ వాడని వారితో చాట్ చేసేందుకు.. త్వరలో గెస్ట్ చాట్ ఫీచర్

వాట్సాప్​లో ‘గెస్ట్ చాట్​’ అనే కొత్త ఫీచర్ త్వరలోనే రానుంది. సాధారణంగా ఎవరికైనా వాట్సాప్​లో మెసేజ్ చేయాలంటే వాళ్ల కాంటాక్ట్ నెంబర్ ఫోన్​లోనే ఉంటుంది. అయితే వాట్సాప్​ వాడని వాళ్లకు మెసేజ్​ చేయాలంటే ఎలా? ఇప్పటికైతే కుదరదు. కానీ, రాబోయే రోజుల్లో గెస్ట్ చాట్ ద్వారా మెసేజ్ పంపొచ్చు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే.. వాట్సాప్​ లేని వాళ్లకు ఒక స్పెషల్ లింక్ పంపించాలి. వాళ్లు ఆ లింక్ పై క్లిక్  చేసి బ్రౌజర్​ ఓపెన్ చేసి చాట్ మొదలుపెట్టొచ్చు. అందుకోసం యాప్​ను ఇన్​స్టాల్ చేయడం, అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేనే లేదు. 

ఇది వాట్సాప్​ వెబ్​ వంటి ఇంటర్​ఫేస్ ద్వారా పనిచేస్తుంది. ఈ ప్రాసెస్​ ఫాస్ట్​గా, ఈజీగా అయిపోతుంది. కాకపోతే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. చాట్​ అంటే టెక్స్ట్ మెసేజ్​ మాత్రమే చేయగలరు. అంతేకానీ, ఎలాంటి మీడియా ఫైల్​ను షేర్ చేయలేరు. గెస్ట్​ చాట్​లో ఫొటోలు, వీడియోలు, జిఫ్​లు, వాయిస్​ నోట్​లు పంపలేరు. వాయిస్ లేదా వీడియో కాల్స్​ కూడా చేయలేరు. ప్రస్తుతం ఈ ఫీచర్​ టెస్టింగ్​ దశలో ఉంది.

వెయ్యిమంది ఫాలోవర్లుఉండాల్సిందేనా?

ఇన్​స్టాగ్రామ్​లో రీల్స్ చేసేవాళ్లలో చాలామంది తమ ఫాలోవర్లతో లైవ్​ బ్రాడ్​ కాస్ట్ చేస్తుంటారు. మొన్నటివరకు అయితే ఫాలోవర్లు ఎంతమంది ఉన్నా లైవ్​కి రావడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. కానీ, ఇప్పుడు ఇన్​స్టాగ్రామ్​, యూజర్లకు కొత్త రూల్​ తీసుకొచ్చింది. కనీసం వెయ్యి మంది ఫాలోవర్లు లేకపోతే లైవ్​ బ్రాడ్ కాస్ట్ చేయడం వీలు కాదని తేల్చిచెప్పేసింది. అంతేకాదు.. లైవ్​ చేయాలంటే వాళ్ల అకౌంట్​ పబ్లిక్​గా ఉండాలని చెప్పింది. దీంతో తక్కువ మంది ఫాలోవర్లు ఉన్న క్రియేటర్లు, కొత్త యూజర్లకు లైవ్​లోకి వచ్చే చాన్స్​ మిస్ అవుతుంది.

 ఒక రిపోర్ట్ ప్రకారం.. ఈ రూల్​ కూడా మన దేశంలోనే అమలవుతోందని తెలిసింది. ఆండ్రాయిడ్, ఐఫోన్​ యూజర్లందరికీ వర్తిస్తుంది. అయితే చిన్న చిన్న బిజినెస్​లు చేసేవాళ్లు, స్టార్టింగ్ స్టేజీలో ఉన్న కంటెంట్ క్రియేటర్లపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపించే చాన్స్ ఉంది. రోజూ లైవ్​ ద్వారా తమ ఫాలోవర్స్​తో కనెక్ట్​ అయ్యి ఫ్యాన్ బేస్ పెంచుకుంటున్న చిన్న క్రియేటర్లకు ఇది మైనస్​. దీంతో ఈ రూల్​ తీసుకురావడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ రూల్​ పెట్టడానికి గల కారణాలేంటో ఇప్పటికైతే క్లారిటీ రాలేదు. 

యూజర్​ ‘సేఫ్టీ’ కోసం..

స్టాక్ మార్కెట్స్, ఆన్​లైన్ బెట్టింగ్స్ వంటి గ్రూప్​ మోసాల నుంచి యూజర్లకు సేఫ్టీ కల్పించాలనే ఉద్దేశంతో వాట్సాప్​ ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అదే ‘సేఫ్టీ ఓవర్​ వ్యూ’. ఇది వాట్సాప్​ గ్రూప్ స్కామ్​ల్లో చిక్కుకోకుండా కాపాడుతుంది. అంతేకాదు.. గ్రూప్​ గురించి ఇంపార్టెంట్ విషయాలను చేరవేయడం, ఫిషింగ్​ వంటి ఇతర మెసేజింగ్ స్కామ్​ల బారిన పడకుండా రక్షిస్తుంది. మీ కాంటాక్ట్స్​లోని వ్యక్తి ఎవరైనా మిమ్మల్ని తమ వాట్సాప్​ గ్రూప్​లో యాడ్​ చేయగానే.. ఈ ఫీచర్ ఆటోమెటిక్​గా ఎనేబుల్ అవుతుంది. 

వెంటనే ఆ గ్రూప్​ గురించిన పూర్తి వివరాలు మీకు సెండ్ చేస్తుంది. అందులో గ్రూప్ ఎప్పుడు క్రియేట్​ చేశారు? ఎవరు చేశారు? మిమ్మల్ని అందులో యాడ్ చేసినవాళ్లు ఎవరు? ఎంతమంది ఉన్నారు? వంటివి చూపిస్తుంది. ఆ వివరాలన్నీ చూసి ఆ గ్రూప్​లో ఉండాలో? ఎగ్జిట్‌ కావాలో? నిర్ణయించుకోవచ్చు. వద్దనుకుంటే రిజెక్ట్ చేయొచ్చు. అసలు ఆ గ్రూప్ వివరాలు కూడా తెలియాల్సిన అవసరం లేదు అనుకుంటే వెంటనే ఎగ్జిట్ అవ్వొచ్చు. అదే గ్రూప్​లో కొనసాగాలంటే మాత్రం చెక్​మార్క్​ అనే ఆప్షన్​ క్లిక్ చేయాలి. చెక్ మార్క్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదా  రిజెక్ట్ చేస్తారా? అనేది కన్ఫర్మ్ చేసేవరకు నోటిఫికేషన్లు రాకుండా మ్యూట్​లో ఉంటాయి.