వాట్సాప్ యూజర్లు మల్టీ డివైజ్లలో వాడేందుకు కొత్త ఫీచర్ తీసుకొచ్చింది మెటా. విండోస్ డెస్క్టాప్ వాడేవాళ్ల కోసం కొత్త వాట్సాప్ యాప్ డిజైన్ చేసింది. అయితే, దాన్ని మొబైల్లో వాట్సాప్ ఎలా వాడతారో, అలానే వాడొచ్చు. అంతే స్పీడ్గా పనిచేస్తుంది. అలాగే ఒకేసారి నాలుగు డివైజ్లలో వాట్సాప్ లింక్ చేసి, వాడుకునే వీలుంది. సాధారణంగా వాట్సాప్ని మొబైల్లో వాడతారు. కొందరు వెబ్ వాట్సాప్ ద్వారా సిస్టమ్లో చాట్ చేస్తారు. అలానే ల్యాప్ టాప్, ట్యాబ్లలోనూ వాడతారు. ఇలా మొబైల్ నుంచి వేరే డివైజ్లలో ఏదో ఒకదానికి కనెక్ట్ చేసి వాడతారు. కానీ, ఇప్పుడు మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్, సిస్టమ్ నాలుగింటికి ఒకేసారి కనెక్ట్ చేసి వాట్సాప్ వాడొచ్చు. ఒక మెసేజ్ మొబైల్ నుంచి, రెండో మెసేజ్ ల్యాప్టాప్ నుంచి ఇవ్వొచ్చు. అంతేకాదు, మొబైల్ ఆఫ్లైన్లో ఉన్నా మెసేజ్లు సింక్, ఎన్క్రిప్ట్ అవుతాయి. ఇలా నాలుగు మెసేజ్లు నాలుగు డివైజ్ల నుంచి ఇవ్వొచ్చు.
విండోస్ డెస్క్టాప్ మీద వాట్సాప్ అప్డేట్ చేసుకుంటే కొత్త ఫీచర్స్ కూడా వాడుకోవచ్చు. వాటిలో వాయిస్, వీడియో కాల్ ఆప్షన్స్ ఉన్నాయి. అలా చేయాలంటే ముందే లింక్ చేసి పెట్టుకోవాలి. ఇది ఎక్కువగా మొబైల్ ఛార్జింగ్ లేనప్పుడు లేదా ఛార్జింగ్ సేవ్ చేసుకోవాలన్నప్పుడు ఉపయోగించుకోవచ్చు. అదెలాగంటే... ముందుగా ఫోన్ నెంబర్ లింక్ అయిన డివైజ్లో వాట్సాప్ ఓపెన్ చేయాలి. తర్వాత సెట్టింగ్స్కి వెళ్లి ‘లింక్డ్ డివైజెస్’ సెలక్ట్ చేయాలి. ‘లింక్ ఎ న్యూ డివైజ్’ క్లిక్ చేసి, అందులో కనిపించే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. రెండో డివైజ్లో ఓపెన్ చేయాలంటే, వెబ్ బ్రౌజర్లో వెబ్ వాట్సాప్ పేజ్ ఓపెన్ చేయాలి. తర్వాత క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. డివైజ్ సింక్ అయ్యాక చాట్స్ అన్నీ సెకండ్ డివైజ్లో కనిపిస్తాయి. ఇదే విధంగా మిగతా డివైజ్లలో లింక్ చేయాలి. ఏదైనా డివైజ్ నుంచి అన్లింక్ చేయాలంటే వాట్సాప్ నుంచి ఎప్పుడైనా లాగవుట్ కావచ్చు. ఆన్లైన్లో ఉండి చాట్ చేయాల్సిన పనిలేదు.14 రోజుల వరకు ఫోన్ వాడకపోతే, మిగతా డివైజ్లలో ఆటోమెటిక్గా వాట్సాప్ లాగవుట్ అవుతుంది. దాంతో ఫోన్లో వాట్సాప్ అకౌంట్ రిజిస్టర్ చేసుకుని, కొత్త డివైజ్లకు లింక్ చేసుకోవాలి.