ప్రాజెక్టులకు మరమ్మత్తులు చేయరు కానీ.. సంక్రాంతి డ్యాన్సులు చేస్తారు: షర్మిల

ప్రాజెక్టులకు మరమ్మత్తులు చేయరు కానీ..  సంక్రాంతి డ్యాన్సులు చేస్తారు: షర్మిల

గత10 ఏళ్లలో టిడిపి అధినేత చంద్రబాబు, ముఖ్యమంత్రి జగన్ లు రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. జనవవరి 27వ తేదీ శనివారం ఉదయం షర్మిల ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా గుండ్లకమ్మ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టు గేట్లు కొట్టుకు పోతుంటే సంబంధిత శాఖ మంత్రి మాత్రం సంక్రాంతి డ్యాన్సులు చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

రూ.-750 కోట్లతో-  గుండ్లకమ్మ ప్రాజెక్టును వైఎస్ఆర్ కట్టించి.. లక్ష ఎకరాలకు సాగునీరు అందించారని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 12 మండలాల ప్రజలకు, ఒంగోల్ పట్టణానికి త్రాగునీరు అందుతుందన్నారు. అలాంటి ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. నిర్వహణ విషయంలో గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.  నిర్వహణ లేకనే గేట్లు కొట్టుకుపోయాయి అధికారులు చెప్పారని.. మరమత్తులు చేయాల్సింది పోయి ప్రాజెక్టు నిర్వహణలో లోపాల చెబుతున్నారని సీరియస్ అయ్యారు. అప్పుడు.. టీడీపీ జలయజ్ఞం దోపిడీ అని అర్థం లేని ఆరోపణలు చేసిందన్నారు.

ఇళ్లు కట్టుకున్నా..దానికి నిర్వహణ అవసరమని..  పట్టించుకోకుండా ఉంటే ఏదైనా తుప్పు పడుతుందన్నారు.   ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం గేట్లు కొట్టుకు పోతుంటే డ్యాన్సులు చేస్తుందని విమర్శించారు షర్మిల. సంబంధిత మంత్రి సంక్రాంతి డ్యాన్సులు చేస్తారు తప్పా..పని చేయరన్నారు. జగన్ ఆన్నకు మరమత్తులు చేయించడానికి మనసు రావడం లేదట..  ఇదేనా వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టడం అంటే అని ప్రశ్నించారు.   వైఎస్సార్ కట్టిన ప్రాజెక్టును పట్టించుకోని మీరు.. ఎలా వైఎస్సార్ వారసులు అవుతారన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి ..లేకుంటే ప్రాజెక్టు మొత్తం కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

రూ.10 కోట్లు ఇస్తే ఇస్తే ప్రాజెక్టు నిలబడుతుందన్నారు.  ప్రాజెక్టు కింద వేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. వెలిగొండ ప్రాజెక్టును సైతం నిర్లక్ష్యం చేశారని అన్నారామె. 40 TMC సామర్ధ్యం కలిగిన అతిపెద్ద ప్రాజెక్టు వెలిగొండ.. 4.50లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు సైతం పక్కన పడిందన్నారు. గత 10 ఏళ్లలో చంద్రబాబు, జగన్ ఆన్న తట్టెడు  మట్టి కూడా మోయాలేదని షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.