
శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో యశ్వంత్ దగ్గుమాటి నిర్మిస్తున్న చిత్రం ‘పిండం’. ది స్కేరియస్ట్ ఫిల్మ్ అనేది ట్యాగ్లైన్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను హీరో శ్రీవిష్ణు లాంచ్ చేసి టీమ్కి బెస్ట్ విషెస్ చెప్పాడు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇదొక కంప్లీట్ హారర్ మూవీ. ఇంతటి భయానక చిత్రాన్ని ఇంతవరకూ చూసి ఉండరు. ఇందులో ప్రస్తుత పరిస్థితులతో పాటు 1930, 1990 మూడు కాలక్రమాలలో జరిగేదిగా కనిపిస్తుంది. స్క్రీన్ప్లే హైలైట్గా ఉంటుంది. అక్టోబర్ 30న టీజర్ను, నవంబర్లో సినిమా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు. ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.