దళిత బంధుకోసం లక్ష కోట్లు

దళిత బంధుకోసం లక్ష కోట్లు

దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతుందని, అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తామని తెలిపారు సీఎం కేసీఆర్. దశలవారీగా అమలు చేసే ఈ పథకం  కోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ తో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపేందుకు ప్రగతిభవన్ కు తరలివచ్చారు. ఇందులో భాగంగా  ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు సీఎం కేసీఆర్.

హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళితబంధు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచి దేశ దళితులందరినీ ఆర్ధిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేయబోతోందన్నారు కేసీఆర్ . అందుకు పట్టుదలతో అందరం కలిసి పథకం విజయవంతం అయ్యేందుకు కృషి చేయాలంటూ.. దళిత ప్రజాప్రతినిధులకు, మేధావులకు, సంఘాల నేతలకు పిలుపునిచ్చారు.