- గార్బా డ్యాన్స్ చేస్తూ..24 గంటల్లో 10 మంది మృతి
- గుజరాత్లో నవరాత్రి వేడుకల్లో విషాదం
అహ్మదాబాద్: గుజరాత్లో జరుగుతున్న నవరాత్రి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. గార్బా డ్యాన్స్ చేస్తూ.. 24 గంటల వ్యవధిలో 10 మంది చనిపోయారు. మృతుల్లో బరోడాకు చెందిన 13 ఏండ్ల బాలుడు, కాపడ్వాంజ్కు చెందిన బాలుడు (17), అహ్మదాబాద్కు చెందిన ఓ యువకుడు (24) కూడా ఉన్నారు. డ్యాన్స్ చేస్తుండగా వీరంతా కుప్పకూలారని, హార్ట్ ఎటాక్ వల్లే చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
నవరాత్రి ఉత్సవాలు మొదలైన తొలి ఆరు రోజుల్లో 108 సర్వీసులకు హార్ట్ ఎటాక్కు సంబంధించిన 521 కాల్స్ వచ్చాయని, శ్వాస ఆడటం లేదంటూ 609 ఫోన్స్ వచ్చాయని అధికారులు చెప్పారు. ఈ ఫోన్ కాల్స్ అన్నీ సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు వచ్చాయని వివరించారు. గుజరాత్లోనే నవరాత్రి ఉత్సవాలకు ముందు గార్బా ప్రాక్టీస్ చేస్తూ ముగ్గురు వ్యక్తులు చనిపోయారు.