దూల్​పేట్​లో 10 కేజీల గంజాయి సీజ్

దూల్​పేట్​లో 10 కేజీల గంజాయి సీజ్
  • ఐదుగురి అరెస్టు

మెహిదీపట్నం, వెలుగు : దూల్​పేట్​ లో 10 కిలోల గంజాయి పట్టుబడింది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాకు చెందిన భరత్ అలియానా, పద్మ  దంపతులు. వీరు దూల్ పేట్​కు చెందిన మహేందర్ సింగ్​తోపాటు ఆయన బంధువులు సుమన్ బాయ్,  అమర్ సింగ్ పరిచయం చేసుకొని గంజాయి దందా ప్లాన్ వేశారు. ఈ ఐదుగురిని మహేందర్ సింగ్ నివాసంలో టాస్క్ ఫోర్స్, మంగళహాట్ పోలీసులు పక్కా సమాచారంతో సోమవారం రాత్రి పట్టుకున్నారు. 

నిందితుల నుంచి 10 కిలోల గంజాయి, రూ.3 వేల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన మరో పెడ్లర్ తుక్కు పాని పరారీలో ఉన్నట్లు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ సౌత్ వెస్ట్ జోన్ డీసీవీ వైవీఎస్ సుధీంద్ర తెలిపారు. భరత్ దంపతులు గతంలో ఖమ్మంలో 32 కిలోల గంజాయితో పట్టుబడినట్లు పేర్కొన్నారు.