సింగరేణి భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి : ఆఫీసర్ బాలరాజు

సింగరేణి భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి : ఆఫీసర్ బాలరాజు
  •     చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ ఆఫీసర్​బాలరాజు

గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో పనిచేస్తున్న భద్రతా సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని, సంస్థ ఆస్తులు కాపాడడంలో, సిబ్బంది ప్రాణాలు కాపాడడంలో అప్రమత్తతంగా ఉండాలని చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ ఆఫీసర్​ పి.బాలరాజు సూచించారు. ఇటీవల చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిసారిగా మంగళవారం గోదావరిఖనిలోని ఆర్జీ 1 ఏరియాను సందర్శించారు. 

ఈ సందర్భంగా సింగరేణి ఆఫీసర్లు పుష్ఫగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సెక్యూరిటీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ సెక్యూరిటీ సిబ్బంది భద్రతా ప్రమాణాలను కఠినంగా పాటించాలన్నారు. 

సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం ఎప్పుడూ ప్రాధాన్యమిస్తుందని భరోసా కల్పించారు. కాగా ఓసీపీ 5 చెక్​పోస్ట్​ను సందర్శించి కోల్​ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన లారీల చెక్​అవుట్, తదితర విషయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో జీఎం లలిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోటూ జీఎం చంద్రశేఖర్, రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, హన్మంతరావు, వీరారెడ్డి, శ్రీనివాస్​, ఎండీ అక్బర్​అలీ పాల్గొన్నారు.