అగ్నిప్రమాదంలో 10 లక్షలు కాలిపోయినయ్

అగ్నిప్రమాదంలో 10 లక్షలు కాలిపోయినయ్

మునగాల, వెలుగు: గుడిసెకు నిప్పంటుకోవడంతో లోపల దాచిన రూ. 10 లక్షలు కాలిపోయాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామానికి చెందిన కప్పల లక్ష్మయ్యకు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. వీరికి కె టి అన్నారం గ్రామంలో మూడు ఎకరాల భూమి ఉంది. దాన్ని ఇటీవల అమ్మగా అన్నదమ్ములందరికీ తలా రూ. పది లక్షల చొప్పున వచ్చాయి. బంగారం కొందామని లక్ష్మయ్య ఆ డబ్బులను ఇంట్లో దాచి ఉంచాడు. లక్ష్మయ్య భార్య నాగమణి గురువారం సాయంత్రం అన్నం వండేందుకు గ్యాస్ పొయ్యి వెలిగించింది. ఆ సమయంలో  అందులో నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చి గుడిసెకు అంటుకున్నాయి. పెద్దఎత్తున మంటలు వ్యాపించడంతో ఇంట్లో ఉన్న డబ్బులతో పాటు బియ్యం, బట్టలు ఇతర సామాన్లు పూర్తిగా కాలిపోయాయి. చుట్టుపక్కలవారు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.