
చిన్న పిల్లలకు ఏదైనా కొత్తగా, వింతగా కనిపిస్తుంది. ప్రతి సిచువేషన్ లో సరదాగా, ఉల్లాసంగా గడిపేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి ప్రయత్నమే చేసి తండ్రి చేతిలో హత్యకు గురయ్యాడు పదేళ్ల బాలుడు. వర్షం వస్తుంటే ఉల్లాసంగా కాసేపు ఆడుకోవాలని ప్రయత్నించాడు. వాళ్ల నాన్న వద్దని హెచ్చరిస్తుంటే వర్షంలో ఆడాలనుందని మారాం చేశాడు. ఆ మాత్రం దానికే కత్తితో పొడిచి చంపాడు ఓ తండ్రి.
శవరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో శనివారం (జూన్ 28) ఉదయం జరిగింది ఈ ఘటన. పదేళ్ల బాలుడు కత్తి గాయాలతో ఆస్పత్రిలో చేరినట్లు ఉదయం దాదా దేవ్ ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది. దీంతో ఆస్పత్రికి వెళ్లి పోలీసులు పరిశీలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
విచారణ చేపట్టిన పోలీసులు.. కత్తితో పొడవటంతోనే చనిపోయినట్లు నిర్ధారించారు. ఆ తర్వాత దర్యాప్తులో భాగంగా తండ్రి నుంచి సమాధానం రాబట్టారు. సాగర్ పూర్ ఏరియాలో ఉంటున్న ఏ.రాయ్ (40) అనే వ్యక్తి తన కొడుకును పొడిచినట్లు అంగీకరించాడు.
►ALSO READ | ఖమ్మం ఎస్సై భార్య అనుమానాస్పద మృతి.. వేధింపులే కారణం..?
వర్షంలో ఆడుకోవడానికి వెళ్లొద్దని తండ్రి చెప్పాడట. కొడుకు వినకపకోవడంతో సహనం నశించిన తండ్రి కిచెన్ లో ఉన్న కత్తి తెచ్చి బాలుడు ఎడమ కడుపులో పొడిచేశాడు. బాబు గాయాలతో పడి ఉండటంతో వెంటనే పొడిచిన తండ్రే బాలుడిని ఆస్పత్రికి తరలించాడు. కానీ బాబు అప్పటికే మృతి చెందాడు.
పోలీసుల వివరాల ప్రకారం నిందితుడు నలుగురు పిల్లలతో ఒకే రూమ్ లో రెంట్ కు ఉంటున్నాడు. అతని భార్య కొన్ని సంవత్సరాల క్రతమే చనిపోయింది. చనిపోయిన బాలుడు మూడో వాడని పోలీసులు చెప్పారు. విచక్షణ కోల్పోయి బాలుడిని పొడిచిన తండ్రిపై మర్డర్ కేస్ నమోదు చేశారు పోలీసులు.