
రేవల్లి, వెలుగు: నాగపూర్ రైతు వేదిక సమీపంలో మండల స్థాయిలో పతంజలి యువ ప్రభారి మండల యోగా కేంద్రం ఆధ్వర్యంలో గురువారం యోగాంధ్రలో భాగంగా 1000 మందితో యోగాభ్యాసం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా అడిషనల్ కలెక్టర్ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, డీఎంహెచ్ఓ శ్రీనివాసులు హాజరయ్యారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని యాదయ్య అన్నారు. యోగాతో క్రమశిక్షణ, జ్ఞాపకశక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు పాల్గొన్నారు.
విద్యార్థి దశ నుంచే యోగా చేయాలి
మరికల్, వెలుగు: ప్రతి విద్యార్థి ప్రాథమిక దశ నుంచే యోగాసనాలు చేస్తే ఉల్లాసంగా ఉంటారని యోగా గురువు హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యుడు రామాంజనేయులు తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని శ్రీవాణి విద్యా మందిర్ స్కూల్లో ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. యోగాతో చదువులో రాణిస్తారని చెప్పారు. ఉపాధ్యాయ బృందం తదితరులు
పాల్గొన్నారు.