యోగాతో మానసిక ప్రశాంతత .. నాగపూర్‌‌‌‌‌‌‌‌లో1000 మందితో యోగాసనాలు

యోగాతో మానసిక ప్రశాంతత .. నాగపూర్‌‌‌‌‌‌‌‌లో1000 మందితో యోగాసనాలు

రేవల్లి, వెలుగు: నాగపూర్ రైతు వేదిక సమీపంలో మండల స్థాయిలో పతంజలి యువ ప్రభారి మండల యోగా కేంద్రం ఆధ్వర్యంలో గురువారం యోగాంధ్రలో భాగంగా 1000 మందితో యోగాభ్యాసం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా అడిషనల్​ కలెక్టర్ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, డీఎంహెచ్‌‌‌‌ఓ శ్రీనివాసులు హాజరయ్యారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని యాదయ్య అన్నారు. యోగాతో క్రమశిక్షణ, జ్ఞాపకశక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు పాల్గొన్నారు. 

విద్యార్థి దశ నుంచే యోగా చేయాలి 

మరికల్, వెలుగు: ప్రతి విద్యార్థి ప్రాథమిక దశ నుంచే యోగాసనాలు చేస్తే ఉల్లాసంగా ఉంటారని యోగా గురువు హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యుడు రామాంజనేయులు తెలిపారు.  గురువారం మండల కేంద్రంలోని శ్రీవాణి విద్యా మందిర్ స్కూల్‌‌‌‌లో ​ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. యోగాతో చదువులో రాణిస్తారని చెప్పారు. ఉపాధ్యాయ బృందం తదితరులు
 పాల్గొన్నారు.