తమిళనాడులో మహిళలకు ప్రతినెల రూ.వెయ్యి

తమిళనాడులో మహిళలకు ప్రతినెల రూ.వెయ్యి

ధర్మపురి: స్టాలిన్​ సర్కార్​ తమిళనాడులో మహిళలకు ప్రతి నెలా రూ.వెయ్యి అందజేయనుంది. మంత్లీ బేసిక్​ ఇన్​కమ్​ స్కీమ్​రిజిస్ర్టేషన్​క్యాంప్​ను సోమవారం సీఎం స్టాలిన్​ధర్మపురి సిటీలో ప్రారంభించారు. అధికార డీఎంకే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని సెప్టెంబర్​నుంచి అమలుచేయనున్నారు. ఈ సందర్భంగా బయోమెట్రిక్​ రిజిస్ర్టేషన్​ ప్రక్రియను స్టాలిన్​ స్వయంగా పర్యవేక్షించారు. ధర్మపురి జిల్లాలో తొలిదశ స్పెషల్​ క్యాంప్​ ఈ నెల 24నుంచి ఆగస్టు 4వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 2,21,484  రేషన్​కార్డ్​ హోల్డర్స్ లబ్ధి పొందనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, రెండో దశ క్యాంప్​ను ఆగస్టు 5 నుంచి 16వరకు నిర్వహించనున్నామని,  రాష్ట్రవ్యాప్తంగా  రిజిస్ట్రేషన్​ కోసం 35,923 క్యాంప్​లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వివరించారు.