- ఐదుగురు అరెస్ట్
శంషాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా పాలమాకుల రోడ్లో శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన అపూర్వ విశ్వాస్, మైదాన్ విశ్వాస్, వాసుదేవ్ హలాత్, రబీన్ మండల్, ఫిరోజ్ ఈ ఐదుగురు మల్కాన్ గిరిలోని ఏజెన్సీ ఏరియా నుంచి సిటీ మీదుగా కర్నాటకలోని బెంగళూరుకు గంజాయిని సప్లయ్ చేస్తున్నారు.
ఆదివారం పాలమాకుల రోడ్లో శంషాబాద్ పోలీసులు తనిఖీలు చేపట్టి బెంగళూరు వైపు వెళ్తున్న వీరి వెహికల్ను పట్టుకున్నారు. 102 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై గతంలో ఖమ్మం జిల్లా ఇల్లందులో కేసు నమోదైనట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.