ట్రాక్టర్ పై నుంచి పడి టెన్త్ స్టూడెంట్ మృతి

ట్రాక్టర్ పై నుంచి పడి టెన్త్ స్టూడెంట్ మృతి

శాయంపేట, వెలుగు: నడుస్తున్న ట్రాక్టర్ పై నుంచి కిందపడి ఓ పదో తరగతి స్టూడెంట్ చనిపోయాడు. ఎస్‌‌ఐ పరమేశ్ తెలిపిన వివరాల ప్రకారం..   ఆత్మకూర్​మండలం హౌజ్​బుజూర్గు గ్రామానికి చెందిన షేక్​ ఫిరోజ్​ఆహ్మద్ (16)  నేరేడుపల్లిలో గవర్నమెంట్​ హైస్కూల్​లో టెన్త్​ చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం బడి అయిపోగానే ఇంటికెళ్లేందుకు స్కూల్ పిల్లలతో కలిసి బయటికి వచ్చాడు. హౌజుబుజుర్గు గ్రామానికి చెందిన సయ్యద్​ఉమర్​అనే వ్యక్తి ఆ సమయంలో ట్రాక్టర్ తో స్కూల్​ ముందు నుంచి వెళుతున్నాడు.  

డ్రైవర్​తెలిసిన వ్యక్తి కావడంతో ఇంటికి వెళ్లేందుకు స్టూడెంట్స్  ట్రాక్టర్ ఎక్కారు. ఈ క్రమంలో  నేరేడుపల్లి శివారులోని పల్లె ప్రకృతి వనం వద్దకు  చేరుకోగానే మూలమలుపు వద్ద డ్రైవర్​సయ్యద్​ఉమర్​సడెన్​బ్రేక్​వేయడంతో ఫిరోజ్​ట్రాక్టర్​పై నుంచి కిందపడ్డాడు.  

ఫిరోజ్‌‌ తల, చాతి, నడుము, భుజానికి బలమైన గాయాలయ్యాయి.  ఫిరోజ్‌‌ను ఆరెపల్లిలోని ఓ ప్రైవేటు హాస్పిట్​లకు తరలించగా అప్పటికే అతడు​మృతి చెందినట్లు డాక్టర్​ చెప్పారు. ఫిరోజ్​మృతికి ట్రాక్టర్​డ్రైవర్​సయ్యద్ ఉమర్​కారణమని స్టూడెంట్ తండ్రి షేక్​ కమల్​బుధవారం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. దీంతో శాయంపేట ఎస్ఐ పరమేశ్​ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్లు చెప్పారు.