కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందరినీ పాస్ చేయాలని నిర్ణయించినట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. వాస్తవానికి తప్పనిసరిగా పరీక్షలు పెట్టాలని అనుకున్నామని, అయితే విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. విద్యా శాఖ ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి, ఆ వివరాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నివేదించి.. తుది నిర్ణయానికి వచ్చామని అన్నారు. టెన్త్ విద్యార్థులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించిందని, అందుకే పరీక్ష విధానంలో మార్పులు చేశామని, 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లుగా మార్చి షెడ్యూల్ ప్రకటించామని చెప్పారు. భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు రాసేందుకు ఎగ్జామ్ సెంటర్లు పెంచామని, అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు మంత్రి సురేశ్. అయితే కరోనా వైరస్ వ్యాప్తి దృష్యా అన్ని వర్గాలతో చర్చించి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లామని, కరోనా ప్రబలుతున్న సమయంలో ఏ తల్లి తన బిడ్డ ఆరోగ్యం గురించి బెంగపెట్టుకోకూడదని సీఎం జగన్ చెప్పారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు రాసేందుకు ఫీజు కట్టిన 6,30,804 మంది విద్యార్థులను పరీక్షలు లేకుండా పాస్ చేయాలని ఆయన ఆదేశించారన్నారు. అయితే వారికి గ్రేడింగ్ ఎలా ఇవ్వాలన్న దానిపై మార్గదర్శకాలను రూపొందించాలని విద్యా శాఖ అధికారులకు సూచించామని మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. అలాగే ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ అయిన ఫస్టియర్, సెకండియర్ ఇంటర్ విద్యార్థులను కూడా సప్లిమెంటరీ పరీక్షలు లేకుండా పాస్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.
ఏపీలో టెన్త్ పరీక్షలు రద్దు.. ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులకూ గుడ్ న్యూస్
- ఆంధ్రప్రదేశ్
- June 20, 2020
మరిన్ని వార్తలు
-
ఆర్టిస్టులను అరెస్ట్ చేస్తారా : ఫేక్ వ్యూస్ చేశాడని వ్యక్తి అరెస్ట్..
-
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారం అందుకునేది ఎప్పుడంటే?
-
4వేల 500 అడుగుల ఎత్తులో పోలింగ్ స్టేషన్..కేవలం 164ఓటర్ల కోసమట ..ఎక్కడంటే..
-
రేషన్ కార్డు ఇచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం : శ్రీధర్ బాబు
లేటెస్ట్
- ఆర్టిస్టులను అరెస్ట్ చేస్తారా : ఫేక్ వ్యూస్ చేశాడని వ్యక్తి అరెస్ట్..
- Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారం అందుకునేది ఎప్పుడంటే?
- 4వేల 500 అడుగుల ఎత్తులో పోలింగ్ స్టేషన్..కేవలం 164ఓటర్ల కోసమట ..ఎక్కడంటే..
- రేషన్ కార్డు ఇచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం : శ్రీధర్ బాబు
- SRH vs LSG: కనిపించని వరుణుడి జాడ.. ఉప్పల్ స్టేడియానికి భారీగా చేరుకుంటున్న అభిమానులు
- ఆర్బీఐ ఆంక్షలు: PhonePe, Google Pay ట్రాన్జక్షన్లపై లిమిట్
- చిక్కుల్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ .. విమానాల రద్దుపై ప్రభుత్వం సీరియస్
- పిటిషన్ వేసినందుకు లక్ష రూపాయలు ఫైన్ వేసిన కోర్టు
- IPL 2024: ధోనీ, కోహ్లీ ఆల్టైం రికార్డ్ బ్రేక్.. ఐపీఎల్లో సంజు శాంసన్ అరుదైన ఘనత
- యువతను మోసం చేసి బీజేపీ రెండు సార్లు గద్దెనెక్కింది : విజయరమణారావు
Most Read News
- బేగంపేట నాళాలో కొట్టుకొచ్చుని డెడ్బాడీలు
- Good Health : మీకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉందా.. కారణాలు ఇవే.. లక్షణాలు ఇలా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- కలికాలం.. భోజనంలో స్వీట్స్ లేవని.. పెళ్లి రద్దు..
- బెంగళూరులోనూ మొదలైందా : మెట్రోలో యంగ్ కపుల్ రొమాంటిక్ సీన్స్
- చికెన్ షవర్మా తిని 19 ఏళ్ల యువకుడు మృతి
- KIA EV3 ఎలక్ట్రిక్ SUVను మే 23న లాంఛింగ్
- Ranveer, Deepika: విడాకుల బాటలో మరో బాలీవుడ్ జంట.. క్లారిటీ వచ్చేసింది!
- భారీ వర్షం.. యాదాద్రి ఆలయంలో కొట్టుకుపోయిన చలువపందిళ్లు, రేకుల షెడ్డు
- ప్రియురాలికి నిశ్చితార్థం.. ప్రియుడు సూసైడ్