జిల్లాల వారీగా మున్సిపాలిటీల్లో గెలిచిన.. ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ ల లిస్ట్

జిల్లాల వారీగా మున్సిపాలిటీల్లో గెలిచిన.. ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ ల లిస్ట్

రాష్ట్రంలోని 7  కార్పొరేషన్లలో ఐదింటిని కాంగ్రెస్​ కైవసం చేసుకున్నది. కీలకమైన నిజామాబాద్‌‌‌‌సహా రామగుండం, మంచిర్యాల, మహబూబ్‌‌‌‌నగర్​, నల్గొండ మేయర్ ​సీట్లను అధికారపార్టీ దక్కించుకున్నది. కొత్తగూడెం మేయర్​పీఠాన్ని కాంగ్రెస్​మద్దతుతో మిత్రపక్షం సీపీఐ అధిరోహించింది. ఇక ఊహించినట్లే కరీంనగర్ ​మేయర్​ పీఠం బీజేపీ ఖాతాలో పడింది.  రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన 105 మున్సిపాలిటీల్లో 81 చోట్ల కాంగ్రెస్​ అభ్యర్థులే చైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్స్‌‌‌‌గా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్‌‌‌‌కు కేవలం 18 మున్సిపాలిటీలు దక్కాయి. కార్పొరేషన్లలో ఆ పార్టీ ఈసారి జీరోగా మిగిలిపోయింది.