ఇండియాకు చేరుకోనున్న మరిన్ని క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు

ఇండియాకు చేరుకోనున్న మరిన్ని క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు

హైదరాబాద్: థాయ్‌లాండ్ నుంచి మరిన్ని క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు ఇండియాకు చేరుకున్నాయి. యుద్ధ ప్రాతిపదికన 11  క్రయోజనిక్ ట్యాంకులను భారత్ దిగుమతి చేసుకుంది. ఒక్కో క్రయోజినిక్ ట్యాంకర్ లో 1.40 లక్షల (కోటీ నలభై లక్షల) లీటర్ల ఆక్సిజన్ ఉంటుంది. సామాజిక సేవ, బాధ్యతలో‌ భాగంగా MEIL (మేఘా ఇంజనీరింగ్ సంస్థ) ఈ ట్యాంకర్లను తెప్పించింది. తొలి విడతగా ఆర్మీ విమానంలో 3 ట్యాంకులు రాగా..  ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్, బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఆక్సిజన్ ట్యాంకర్లు చేరుకోనున్నాయి. వీటిని మేఘా సంస్థ ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వనుంది. ప్రస్తుత, భవిష్యత్తు ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యంగా వీటిని తెప్పించారు.