హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్లకు పదోన్నతులు కల్పించింది. 2013వ బ్యాచ్ కు చెందిన 11 మంది ఐఏఎస్ అధికారు లకు అడిషనల్ సెక్రటరీ హోదాతో ప్రమోషన్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
శశాంక్, అద్వైత్ సింగ్, శ్రీజన, శృతి ఓజా, వినయ్, శివలింగయ్య,వాసం వెంకటేశ్వర్, హన్మంతరావు, ఎం. హరిత, హైమావతి, కె. హరిత పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు.
