పడవ బోల్తా .. 11 మంది జలసమాధి

పడవ బోల్తా .. 11 మంది జలసమాధి

టర్కీలో ఘోర ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళుతున్న పడవ మునిగి 11 మంది చనిపోయారు. టర్కీ ఏజియన్ ప్రావిన్స్ లోని సెస్మే పట్టణానికి సమీపంలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారిలో 8 మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో పడవలో 19 మంది ప్రయాణిస్తున్నారు.  సమాచరం అందుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది మరో 8 మందిని  రక్షించారు.