స్పీడ్ పెంచిన బీజేపీ.. రేపు(జులై9) ముఖ్య నేతల సమావేశం

స్పీడ్ పెంచిన బీజేపీ.. రేపు(జులై9) ముఖ్య నేతల సమావేశం

రేపు(జులై 9) హైదరాబాద్ లో బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగే సమావేశంలో 11 రాష్ట్రాల అధ్యక్షులు, ఇంచార్జులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ BL సంతోష్ హాజరుకానున్నారు. 

పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, ఆధ్వర్యంలో జరగనున్న ఈ భేటీలో ప్రకాశ్ జవడేకర్, తరుణ్ చుగ్, బండి సంజయ్ తో పాటు ముఖ్య నేతల పాల్గొన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలతో పాటు వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేసిన కమలం పార్టీ..జనంలోకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. మరోవైపు ప్రజా సమస్యలపై బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. 2012లో కిషన్ రెడ్డి చేపట్టిన పోరు యాత్రలో తరహాలోనే మరో ప్రోగ్రాం డిజైన్ చేసేందుకు సిద్ధమౌతోంది బీజేపీ.

https://www.youtube.com/watch?v=TtlYb0OnjS0