ఆ భూమి వివరాలను ధరణి పోర్టల్ లో​ మార్చాం

ఆ భూమి వివరాలను ధరణి పోర్టల్ లో​ మార్చాం
  • వెలుగు కథనానికి స్పందన
  • 12 ఎకరాల భూమి ధరణిలో మార్చాం–మేడ్చల్ ​కలెక్టర్ గౌతమ్ కుమార్
  • కొర్రెముల మండలం వెంకటాపూర్​ ఆర్​ ఎస్​ నెం: 174
  • ప్రభుత్వ భూమిని .. ప్రైవేట్​వ్యక్తుల పేరుతో ధరణి పోర్టల్​


ఘట్కేసర్, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్​కేసర్ ​మండలంలోని కొర్రేముల రెవెన్యూ గ్రామం వెంకటాపూర్​లో ఉన్న సర్వే నంబర్ 174లోని18.12 ఎకరాల భూమి పూర్తిగా ప్రభుత్వానికి చెందినదని కలెక్టర్ గౌతమ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ​విజయేందర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం వెలుగులో ‘ఆమోయ్ కుమార్ మరో మాయ’ హెడ్డింగ్​తో భూబదలాయింపుపై కథనం పబ్లిష్​ కాగా.. కలెక్టర్, అడిషనల్​కలెక్టర్​ స్పందించారు. 

సర్వే నంబర్ 174 లోని దాదాపు 12 ఎకరాల భూ వివాదంపై అధికారులు విచారణ జరిపారని, అది ప్రభుత్వ భూమి అని తేలడంతో ధరణి పోర్టల్​లో ప్రైవేట్ వ్యక్తుల పేర్లను తొలగించి ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చామన్నారు. అయితే, ఆ 12 ఎకరాల ప్రభుత్వ భూమి తమదేనంటూ తప్పుడు పేపర్లు, దొంగ పాస్​బుక్స్​తో  రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించుకున్న వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.