జనగామలో దొంగల బీభత్సం

జనగామలో దొంగల బీభత్సం

జనగామలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. వాసవి కాలనీ, హర్షనగర్ లోని రెండు ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, నగదు దోచేశారు. ఒకరింట్లో 12 తులాల బంగారం, 45 తులాల వెండి, లక్ష ముప్పై వేల నగదును ఎత్తుకెళ్లారు. మరొకరింట్లో అరతులం బంగారం,8 తులాల వెండి, 6 వేల నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.