పంజాగుట్ట, వెలుగు: ప్రజావాణికి ఫిర్యాదుల సంఖ్య తగ్గింది. మంగళవారం కేవలం 1301 కంప్లయింట్స్ మాత్రమే వచ్చాయని నోడల్ అధికారి దాసరి హరిచందన వెల్లడించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలిసుకున్నారు. భూసమస్యలు, వీఆర్ఏల సర్దుబాటు, 55 నుంచి 61 వయస్సు గల వృద్ధ వీఆర్ఏ కుటుంబాలకు న్యాయం చేయాలని, స్పెషల్డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, డబుల్బెడ్రూమ్ ఇండ్లుఇవ్వాలని ఫిర్యాదులు వచ్చాయి.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరుల నుంచి తమకు ప్రాణ హాని ఉందంటూ బేగంపేటలోని ప్రకాశ్ నగర్ ఎక్స్ టెన్షన్ వాసులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దివ్యాంగులైన తమకు పర్మినెంట్సర్టిఫికెట్ ఇవ్వాలని జనగామ జిల్లాకు చెందిన అఖిల, నిఖిల ప్రభుత్వాన్ని కోరారు. మూడేండ్లకొకసారి సర్టిఫికెట్ చేసుకోవడం ఇబ్బందిగా ఉందన్నారు. ప్రభుత్వం తమకు డబుల్బెడ్రూమ్ ఇండ్లతోపాటు, ఆర్థికంగా సహాయం చేయాలని ప్రజావాణికి ఫిర్యాదు చేశారు.