క్వారంటైన్ లో బాలిక‌పై అత్యాచారం

క్వారంటైన్ లో బాలిక‌పై అత్యాచారం

ఢిల్లీ:  అస‌లే క‌రోనాతో బాధ‌ప‌డుతున్న ఓ బాలిక‌పై అత్యాచారం చేశాడో యువ‌కుడు. ఈ ఘోరం జ‌రుగుతుండ‌గా.. ఆపాల్సిందిపోయి మ‌రో యువ‌కుడు వీడియో తీశాడు. ఢిల్లీలో 10 వేల బెడ్లతో ఏర్పాటు చేసిన అతిపెద్ద కోవిడ్-19 క్వారెంటైన్ కేంద్రంలో జ‌రిగిన‌ ఈ ఘటన ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. క‌రోనాతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఓ బాలిక‌(14) జూలై 15న రాత్రి టాయిలెట్ కు వెళ్లగా.. అదే క్వారంటైన్ లో క‌రోనా ట్రీట్ మెంట్ తీసుకుంటున్న యువ‌కుడు ఆమెపై బాత్ రూమ్ లో అత్యాచారం చేశాడు. ఈ సంఘ‌ట‌న‌ను మ‌రో యువ‌కుడు( క‌రోనా పేషెంట్) వీడియో తీశాడు.

ఈ విష‌యాన్ని బాలిక అదే కేంద్రంలో తనకు తోడుగా ఉన్న కుటుంబ సభ్యుడికి తెలప‌డంతో అధికారులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతో నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి, మ‌రో హాస్పిట‌ల్ కి తరలించిన పోలీసులు.. కోవిడ్ వ్యాధి నుంచి కోలుకోగానే జైలుకు పంపుతామ‌న్నారు. చ‌ట్ట‌ప‌రంగా శిక్షిస్తామ‌ని తెలిపారు సీనియర్ అధికారి పర్విందర్ సింగ్. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.