- తీవ్ర అభ్యంతర వ్యక్తం చేసిన భారత దౌత్యవేత్త పూజా కుమారి
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లో జరిగిన ఓ సెమినార్ లో ఇండియా మ్యాప్ ను తప్పుగా ప్రచురించి ప్రదర్శించారు. దీనిపై భారత దౌత్యవేత్త పూజా కుమారి ఝా తీవ్ర అభ్యంతరం తెలిపారు. బంగ్లాదేశ్ మాజీ హైకమిషనర్ అహ్మద్ తారిఖ్ కరీం ప్రసంగం సందర్భంగా ఈ అభ్యంతరాన్ని లేవనెత్తారు. భారత్లో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగమని ఆమె మరోసారి నొక్కి చెప్పారు. బంగ్లా రాజధాని ఢాకాలో ఇటీవల బంగ్లాదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ లో ‘ సార్క్ పునరుజ్జీవింవ మార్గాలు’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు.
ఈ సెమినార్లో 2009 నుంచి 2014 వరకు భారతదేశంలో బంగ్లాదేశ్ హైకమిషనర్గా పనిచేసిన కరీం మాట్లాడుతుండగా.. ఆడియన్స్లో ఉన్న పూజా కుమారి ఝా ఆయన ప్రదర్శించిన మ్యాప్ తప్పుగా ఉందని ఎత్తి చూపారు. ‘మీరు చూపించిన భారతదేశం మ్యాప్ తప్పు. జమ్మూ కాశ్మీర్.. భారతదేశంలో అంతర్భాగం’ అని ఆమె అన్నారు. అయితే, ఆ మ్యాప్కేవలం ప్రాతినిధ్య ప్రయోజనాల కోసం మాత్రమేనని, వాస్తవ సరిహద్దులను చూపించదని కరీం అన్నారు.
