
తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 5,954 శాంపిల్స్ పరీక్షించగా.. 1410 మందికి పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది. అలాగే ఈ ఒక్క రోజే ఏడుగురు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 30,946కి చేరింది. అలాగే కరోనా మృతుల సంఖ్య 331కి పెరిగింది. ఈ ఒక్క రోజులో 913 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 18,192కి చేరింది. ప్రస్తుతం 12,423 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 918 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 125, సంగారడ్డి జిల్లాలో 79, మేడ్చల్ జిల్లాలో 67 మంది చొప్పున కరోనా బారినపడ్డారు.