
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు నమోదైన కేసుల వివరాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ఒక్క రోజులో నమోదైన 154 పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పేషెంట్ల సంఖ్య 4813కు చేరింది. వారిలో 51 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకు కరోనాపై విజయం సాధించి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,720కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకు ఏపీలో కరోనా మృతుల సంఖ్య 75గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని వేర్వేరు కోవిడ్ ఆస్పత్రుల్లో 2018 మంది చికిత్స పొందుతున్నారు. అయితే రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 3843 మంది లోకల్స్ కాగా, ఇటీవల విదేశాల నుంచి వెనక్కి తీసుకుని వచ్చిన వారు 132 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 838 మంది కరోనా బారినపడ్డారు. అయితే గడిచిన 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల్లో 125 మంది లోకల్స్ ఉన్నారు. మిగిలిన 29 విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి సంబంధించిన కేసులు. అలాగే డిశ్చార్జ్ అయిన వారిలో లోకల్స్ 34 మంది ఉండగా.. 17 మంది ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు ఉన్నారు.