కుంభం ఫౌండేషన్ జాబ్ మేళాతో 1,550 మందికి ఉద్యోగాలు

కుంభం ఫౌండేషన్ జాబ్ మేళాతో 1,550 మందికి ఉద్యోగాలు

యాదాద్రి, వెలుగు: కుంభం ఫౌండేషన్​, 1ఎం1బీ సంయుక్తంగా నిర్వహించిన మేగా జాబ్​మేళాలో 1,550 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి, ఫౌండేషన్​ చైర్మన్​ కుంభం కీర్తిరెడ్డి ఆదివారం నియమామక పత్రాలు అందించారు.  ఎమ్మెల్యే మాట్లాడుతూ 3,500 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించాలన్న ఉద్దేశంతో జాబ్​ మేళా నిర్వహించామని చెప్పారు. 

మొత్తం వచ్చిన అభ్యర్థులకు  స్క్రీనింగ్​ నిర్వహిస్తే 1,900 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారని, 25 కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 1,550 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు. రానున్న రోజుల్లో జాబ్​ మేళాలు నిర్వహిస్తామని, మరింత మందికి ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని చెప్పారు.