ఏపీలో 1555 కేసులు నమోదు

ఏపీలో 1555 కేసులు నమోదు
  • 23,814కి చేరిన కేసులు

అమరావతి: ఏపీలో 24 గంటల్లో 1555 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 23,814కి చేరింది. వారిలో ఏపీకి చెందిన వారు 1500 మంది ఉండగా.. వేరే రాష్ట్రాల వారు 53 మంది, విదేశాల నుంచి వచ్చిన వారు ఇద్దరు ఉన్నట్లు అధికారులు గురువారం హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేశారు. 24 గంటల్లో 16,882 టెస్టులు చేసినట్లు చెప్పారు. వ్యాధి బారినపడి కర్నూల్‌లో ముగ్గురు, అనంతపూర్‌‌లో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, కృష్ణలో ఒకరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు, చిత్తూరులో ఒకరు చనిపోయారు. దీంతో చనిపోయిన వారి సంఖ్య 277కి చేరింది. 10,250 మంది వ్యాధి నుంచి కోలుకోగా.. 10,544 మంది ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు.