- 18 బైక్లు, రూ.24,040 స్వాధీనం
బెల్లంపల్లి రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో కోడి పందాల స్థావరాలపై దాడులు చేయగా 16 మంది పట్టుబడ్డారు. టాస్క్ఫోర్స్ఏసీపీ శ్రీనివాస్వివరాల ప్రకారం.. కళ్లంపల్లి గ్రామ శివారులో కోడిపందాలు జరుగుతున్నాయని పక్కా సమాచారం మేరకు బుధవారం అర్ధరాత్రి టాస్క్ఫోర్స్, నీల్వాయి పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు.
దాడుల్లో కుడిమేత సాయి, జన్నె కమలాకర్, బి.కోటేష్, టి.సాయి, చౌదరి తిరుపతి, ఆత్రం సందీప్, మొగిలి మల్లేశ్, ఎం.హనుమంతు, ఎ.మధుకర్, మానేపల్లి రాజన్న, మానేపల్లి విలాస్, కీర్తి లక్ష్మణ్, కర్పేత తిరుపతి, దందేర మహేశ్, సతిపతి రాజశేఖర్, దోమల మల్లేశ్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 18 బైక్లు, 12 సెల్ఫోన్లు, రూ.24,040 , 4 కోడిపుంజులు, 45 కోడి కత్తులను స్వాధీనం చేసుకుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడిలో టాస్క్ఫోర్స్ఎస్సై రమేశ్, నీల్వాయి ఎస్సై నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
