రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్‌‌కాట్ చేయనున్న విపక్షాలు

రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్‌‌కాట్ చేయనున్న విపక్షాలు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్ ప్రసంగానికి విపక్షాలు డుమ్మాకొట్టనున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్‌‌కాట్ చేయాలని 16 విపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర ఖజగం, రాష్ట్రీయ జనతా దళ్, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త ప్రకటనను రిలీజ్ చేశాయి. మూడు కొత్త వ్యవసాయ చట్టాలు రాష్ట్రాల హక్కులకు, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయని స్టేట్‌మెంట్‌‌లో విపక్షాలు పేర్కొన్నాయి. బడ్జెట్ సెషన్ ప్రారంభం సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల్లో కోవింద్ ప్రసంగించనున్నారు.