మైలార్​దేవ్ పల్లిలో రూ. 17.40లక్షలు సీజ్​

మైలార్​దేవ్ పల్లిలో రూ. 17.40లక్షలు సీజ్​

శంషాబాద్, వెలుగు : లోక్ సభ ఎన్నికల సందర్భంగా పోలీసులు వాహన తనిఖీల్లో భాగంగా శుక్రవారం మైలర్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలోని శాస్త్రిపురం వద్ద యాక్టివాపై వెళ్తున్న వ్యక్తి వద్ద రూ. 17 లక్షల 40 వేలను స్వాధీనం చేసుకున్నారు. డబ్బులు తరలిస్తున్న వ్యక్తిని మైలర్ దేవ్ పల్లి బృందావన్ కాలనీకి చెందిన ఆదిత్యగా గుర్తించారు.

అతడి వద్ద పట్టుబడిన డబ్బుకు ఎలాంటి రసీదు చూపకపోవడంతో సీజ్ చేసి డీటీవోకు అప్పగించారు. హవాలా డబ్బుగా అనుమానిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు.