స్వయం సహాయక బృందాలకు రూ.18 వేల కోట్ల లోన్లు

స్వయం సహాయక బృందాలకు రూ.18 వేల కోట్ల లోన్లు

హైదరాబాద్, వెలుగు: స్వయం సహాయక బృందాలకు ఈ ఏడాది రూ.18 వేల కోట్ల లోన్లు ఇవ్వనున్నట్లు పంచాయతీరాజ్ మంత్రి దయాకర్ రావు తెలిపారు. డ్వాక్రా సంఘాల ద్వారా బ్యాంకింగ్ సేవల విస్తరణ కార్యక్రమంలో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న 424 మంది బ్యాంకింగ్ సఖిలకు గురువారం ఖైరతాబాద్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ బిల్డింగ్​లో బయో మెట్రిక్ డివైజ్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల్లో చైతన్యం, పట్టుదల పెరిగిందని, వారు ఆర్థికంగా బలపడ్డారన్నారు.