హిందూ మహాసముద్రంలో కూలిన చైనా రాకెట్

హిందూ మహాసముద్రంలో కూలిన చైనా రాకెట్

న్యూఢిల్లీ: ఎక్కడ పడుతుందోనని గుబులు పుట్టించిన చైనా రాకెట్ హిందూ మహాసముద్రంలో కూలింది. గత వారంలో లాంచ్ చేసిన ఈ అతిపెద్ద డ్రాగన్ రాకెట్.. హిందూ మహాసముద్రంలో పడిందని చైనా సెంట్రల్ టెలివిజన్ (సీసీటీవీ) సమాచారం. ఈ రాకెట్ శకలాలు మాల్దీవులకు సమీపంలో పడ్డాయి. దీంతో భారత్‌‌కు పెను ముప్పు తప్పినట్లయింది. అంతా ఊపిరి పీల్చుకున్నారు. 18 టన్నుల ఈ రాకెట్ న్యూఢిల్లీలో కూలే అవకాశాలు ఉన్నాయని అంతా ఊహించారు.