- వచ్చే పదేళ్లలో వస్తాయంటున్న అవెండస్ క్యాపిటల్
న్యూఢిల్లీ: డేటా సెంటర్స్ సెక్టార్లోకి భారీగా ఇన్వెస్ట్మెంట్స్ రానున్నాయి. రానున్న 10 ఏళ్లలో 23 బిలియన్ డాలర్ల (రూ.1.88 లక్షల కోట్ల) విలువైన పెట్టుబడులు వస్తాయని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ అవెండస్ క్యాపిటల్ తన రిపోర్ట్లో పేర్కొంది. దేశంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరగడం, డేటా లోకలైజేషన్కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం, స్టోరేజ్ అవసరాలు ఎక్కువవ్వడంతో డేటా సెంటర్స్ బిజినెస్ భారీగా విస్తరిస్తుందని అంచనావేసింది. 5జీ కూడా అందుబాటులోకి రావడంతో ఈ సెక్టార్ దూసుకుపోతుందని తెలిపింది. డేటా సెంటర్స్ కెపాసిటీ ఏడాదికి 40 శాతం చొప్పున వృద్ధి సాధించి 2025 నాటికి 1,700 మెగా వాట్లకు చేరుకుంటుందని అవెండస్ క్యాపిటల్ రిపోర్ట్ పేర్కొంది.
ఇందుకోసం 5 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లు వస్తాయంది. దేశంలో డేటా సెంటర్ల డిమాండ్ 3 వేల మెగా వాట్లకు పెరుగుతుందని, ఇది 2022 లో ఉన్న 800 మెగా వాట్ల కంటే నాలుగు రెట్లు ఎక్కువని వెల్లడించింది. ఇండియాలోని డేటా సెంటర్ సెక్టార్పై బుల్లిష్గా ఉన్నామని అవెండస్ క్యాపిటల్ ఎండీ ప్రతీక్ ఝావర్ అన్నారు. ‘గ్లోబల్ ఇన్వెస్టర్లు లోకల్ పార్టనర్లతో కలిసి పెట్టుబడులు పెట్టే అవకాశం ఎక్కువ. లోకల్ కంపెనీల దగ్గర ల్యాండ్ అందుబాటులో ఉండడం, రెగ్యులేటరీ అప్రూవల్స్ను తెచ్చుకోవడంలో సామర్ధ్యం, వాటి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కేపబిలిటీస్ ఆకర్షించడంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు వీటితో టై అప్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తాయి. రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఇన్వెస్టర్లు తమ అండర్లైయింగ్ పోర్టుఫోలియోని రైట్స్ కింద మార్చుకుంటాయని , ఇన్కమ్ సోర్స్లను పెంచుకుంటాయని భావిస్తున్నాం’ అని ప్రతీక్ అన్నారు.