హైదరాబాద్ శివారులో రూ.2 కోట్లు సీజ్

హైదరాబాద్ శివారులో రూ.2 కోట్లు సీజ్

అబ్దుల్లాపూర్​మెట్, వెలుగు: సిటీ శివారులో భారీ మొత్తంలో క్యాష్​ పట్టుబడింది.  హయత్ నగర్ ఇన్​స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం  సిటీ నుంచి చౌటుప్పల్ వైపు వెళ్తున్న ఓ కారును పెద్దఅంబర్​పేట ఓఆర్ఆర్ సమీపంలో  ఎల్​బీనగర్, హయత్​నగర్ ఎస్​వోటీ పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు. అందులో రూ.2 కోట్లు క్యాష్​ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని.. ఆ క్యాష్ ఎవరికి చెందినది, ఎక్కడికి తరలిస్తున్నారనే వివరాలను తొందరలోనే తెలియజేస్తామని ఇన్​స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టుబడ్డ క్యాష్​ను ఎన్నికల అధికారులకు  అప్పగించామన్నారు. 

షాహినాయత్ గంజ్​లో రూ.98 లక్షలు

మెహిదీపట్నం: రెడ్ హిల్స్ ఏరియాలో ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి ముజీబ్ ఆఫీసులో రిజ్వాన్(23) వర్కర్​గా పనిచేస్తున్నాడు.  రిజ్వాన్ బుధవారం సాయంత్రం పురానాపూల్ వద్ద ఉండే ముజాహిద్​​కు డబ్బులు ఇచ్చేందుకు కారులో బయలుదేరాడు.  జుమ్మెరాత్ బజార్ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు అతడిని అడ్డుకున్నారు. కారును తనిఖీ చేసి రూ.98 లక్షలను గుర్తించారు. ఈ క్యాష్​కు సంబంధించి రిజ్వాన్ సరైన పేపర్లు చూపించకపోవడంతో పోలీసులు ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు ఫైల్ చేశారు.