శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఓ ప్యాసింజర్ వద్ద కోటి 38 లక్షలు విలువ చేసే 2 కిలోల బంగారాన్ని  ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి..విచారిస్తున్నారు.

స్మగ్లర్లు రోజురోజుకు తెలివిమీరిపోతున్నారు. కొత్తదారులు వెతుక్కుంటూ అడ్డదారులు తొక్కుతున్నారు. కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాళ్ల కళ్లు కప్పి బంగారం తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో బంగారం తరలిస్తూ.. చివరికు పోలీసులకు చిక్కుతున్నారు.