దంతెవాడలో ఎదురుకాల్పులు.. ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి

దంతెవాడలో ఎదురుకాల్పులు.. ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు. ఉదయం 5 గంటల సమయంలో కాల్పులు జరిగాయని ఆయన తెలిపారు. చనిపోయిన మావోయిస్టులపై 6 లక్షల రూపాయిల రివార్డు ఉందని అన్నారు. ఘటనా స్థలం నుంచి మృతులకు సంబంధించిన ఆయుధాలతో పాటు మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఇద్దరు మృతుల్లో ఒక మహిళా మావోయిస్టును దర్భా డివిజన్‌లోని మల్లంగెర్ ఏరియా కమిటీకి చెందిన హిడ్మే కొహ్రమేగా గుర్తించారు పోలీసులు.  ఆమెపై గతంలో రూ.5 లక్షల రివార్డు ప్రకటించి ఉన్నామని తెలిపారు. మరో మావోయిస్టులు పేరు పొజ్జే అని, ఆమె తలపై రూ.లక్ష రివార్డ్ ఉందని చెప్పారు. కాగా, ఈ ఘటన జరిగిన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్‌ కొనసాగుతోందన్నారు.