
బీఆర్ఎస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ ను ముంచాయని విమర్శించారు. పోచారంతో సీఎం భేటీ పై దానం స్పందిస్తూ.. పోచారం శ్రీనివాస్ రెడ్డే కాదు చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారని చెప్పారాయన.
కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ యాదవ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ చేరబోతున్నారని చెప్పారు. మేడ్చల్ మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు చేరికలపై రెండు మూడు రోజులుగా సీఎం నివాసంలో చర్చించారని చెప్పారు.
పల్లా , ప్రశాంత్ రెడ్డి , హరీష్ రావు, కేటీఆర్ లు తప్పా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖాళీ అవుతారని అన్నారు. హరీష్ రావుతో కొందరు బీజేపీకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారని బీఆర్ఎస్ భవిష్యత్తు అయోమయంలో పడిందని తెలిపారు.