హైదరాబాద్, వెలుగు: కరోనా నివారణ కోసం ప్రభుత్వం అమలులోకి తెచ్చిన లాక్డౌన్, ఎపిడమిక్డిసిజెస్ యాక్టు విషయంలో పోలీసు శాఖ పక్కాగా వ్యవహరిస్తోంది. జనం బయట తిరగకుండా ఉండేం దుకు ఎక్కడిక్కడ చెక్పోస్టులు పెట్టి పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారి వెహికల్స్ సీజ్ చేస్తున్నారు. ఆ వాహనాలపై ఎపిడమిక్డిసిజెస్ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఐపీపీలోని 188 సెక్షన్కింద పెడుతున్నారు. చట్టాన్ని ఉల్లంఘించడం…. ప్రజల జీవితాలకు, ఆరోగ్యానికి, భద్రతకు భంగం కలిగించినప్పడు ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్షా 80 వేల వెహికల్స్పై మోటార్ వెహికల్ యాక్ట్ (ఎంవీ యాక్ట్) ప్రకారం కేసులు పెట్టారు. వీటిలో 20 వేల వెహికల్స్ను ఎపిడమిక్డిసిజెస్ యాక్టు కింద సీజ్చేశారు. ఎంవీ యాక్ట్ కింద కేసులు పెట్టిన బండ్లకు చలానాలు విధించనున్నారు. సీజ్ చేసినవి ఎపిడమిక్డిసిజెస్ యాక్టును ఎత్తివేసిన తర్వాత అప్పగిస్తారు.
రాజధానిలోనే ఎక్కువ…
ఎక్కువ కేసులు హైదరాబాద్సిటీలోనే నమోదవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్లోనే రోజూ 15 వేల నుంచి 20 వేల వెహికల్స్ పై కేసులు రికార్డవుతున్నాయి. ఈ నెల 23 నుంచి అమలులోకి రాగా పోలీసులు మొదటి రోజు హెచ్చరించి వదిలేశారు. ఆ తరువాత రోజు నుంచి కమిషరేట్ల పరిధి కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ నెల 24న ఒక్క సైబరాబాద్ కమిషనరేట్లోనే 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇలా ఇప్పటి వరకు ఈ కమిషనరేట్ పరిధిలో లక్ష బండ్లపై కేసులు పెట్టారు. మిగతా కమిషనరేట్లలో 80 వేల వరకు కేసులు నమోదయ్యాయి. మొత్తం లక్షా 80 వేల బండ్లలో 20 వేల బండ్లను సీజ్ చేశారు. దీంతో బయటికి వచ్చే వారి సంఖ్య బాగా తగ్గింది.
మూడు కిలోమీటర్ల పరిధి..
ఈ యాక్టు అమలులోకి వచ్చిన వెంటనే రూరల్ఏరియాల్లో గ్రామం యూనిట్గా పెట్టి అక్కడి నుంచి ఎవరూ బయటికి రావద్దని పోలీసు శాఖ స్పష్టం చేసింది. అర్బన్ఏరియాల్లో ప్రతి మూడు కిలో మీటర్ల పరిధిని ఒక యూనిట్గా నిర్ణయించింది. అ పరిధిలోనే కూరగాయలు, మందులు, ఇతర నిత్యావసరాలను కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. ఈ రూల్గట్టిగా అమలు చేస్తోంది. ఎక్కడికక్కడ చెక్పోస్టులు పెట్టింది. మూడు కిలో మీటర్ల పరిధి లోపల కూడా అనవసరంగా బయట తిరిగే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.