
బషీర్బాగ్, వెలుగు: తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు హైదరాబాద్ కోఠి ఇందర్ బాగ్ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో నకిలీ మెడిసిన్ ను పట్టుకున్నారు. సన్ ఫార్మా స్యూటికల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరిట విక్రయిస్తున్న రోసువాస్ ఎఫ్ 20 , రోసువాస్ ఎఫ్ 10 ట్యాబ్లెట్లను అధికారులు గుర్తించారు. సుమారు రూ.3 లక్షల విలువైన మెడిసిన్ను స్వాధీనం చేసుకున్నారు.