
- వారం కింద బల్దియాలో బదిలీలు
- కొత్తవారిని నియమించక సమస్యలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలో ఎంతో కీలమైన పలు శాఖలకు అడిషనల్ కమిషనర్లను నియమించడం లేదు. ఈ నెల12న జీహెచ్ఎంసీలో ఉన్న ఐఏఎస్లు స్నేహ శబరీశ్, కిల్లు శివకుమార్ నాయుడు బదిలీ అయ్యారు. వీరిలో స్నేహ శబరీష్ అడ్వర్టైజ్ మెంట్, అర్బన్బయోడైవర్సిటీ శాఖలకు అడిషనల్కమిషనర్గా ఉండగా.. ఎలక్ట్రికల్, లేక్స్, ఎస్ఎన్డీపీ, ల్యాండ్ అక్విజిషన్ శాఖలకు అడిషనల్డైరెక్టర్గా కిల్లు శివకుమార్ నాయుడు కొనసాగారు.
అయితే ఇందులో ఎలక్ట్రికల్ డిపార్టుమెంట్ బాధ్యతలు ఇతర అధికారికి అప్పగించారు. మిగతా శాఖలు మాత్రం నేటికీ ఎవరికీ అప్పగించలేదు. కాగా, ఆఫీసర్లు బదిలీపై వెళ్లి వారం అవుతున్నా జీహెచ్ ఎంసీ అధికారిక వెబ్ సైట్ లో ఇంకా వారి పేర్లే ఉన్నాయి. కీలకమైన శాఖలకు అధికారులు లేకపోవడంతో కొన్ని సమస్యలకు పరిష్కారం లభించడంలేదు.