కోచి: ఇరాన్కు చెందిన ఫిషింగ్ బోట్ నుంచి 200 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్టు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ సింగ్ తెలిపారు. డ్రగ్స్ విలువ సుమారు రూ.1,200 కోట్లు ఉంటుందని, నేవీ అధికారులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్టు మీడియాతో చెప్పారు. డ్రగ్స్ను నీళ్లలో పడేసి.. ఇరాన్ వాసులు పారిపోయేందుకు ప్రయత్నించారు. తర్వాత డ్రగ్స్తో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకుని మట్టంచెర్రీ వార్ఫ్కు తరలించారు.
ఎన్డీపీఎస్ యాక్ట్– 1985 కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 200 ప్యాకెట్లపైన అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ ప్యాకింగ్ మార్క్లు ఉన్నాయి. కొన్ని డ్రగ్స్ ప్యాకెట్లపై ‘స్కార్పియన్’ సీల్ ఉండగా.. మరికొన్నింటిపై ‘డ్రాగన్’ సీల్ గుర్తులను ఎన్సీబీ అధికారులు గుర్తించారు. ఏడు వాటర్ ప్రూఫ్ లేయర్స్లో డ్రగ్స్ ప్యాక్ చేశారు. అఫ్గాన్ నుంచి తీసుకొచ్చి.. పాకిస్తాన్కు తరలిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. శ్రీలంక బోటులోకి డ్రగ్స్ ఎక్కించేందుకు భారత జలాల్లోకి ప్రవేశించినప్పుడే ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు. శ్రీలంక నౌకను పట్టుకునేందుకు ప్రయత్నించినా..ఫలితం లేకుండా పోయింది.అరేబియా, హిందూ మహా సముద్రం ద్వారా ఇండియాలోకి అఫ్గాన్ హెరాయిన్ వస్తోందన్నారు.