లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అభ్యర్థుల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. బీజేపీ అభ్యర్థి సంబిట్ పాట్రా పూరి లోక్సభ స్థానంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సుచరితా మొహంతిని బరిలో దింపింది. పూరి లోక్సభ స్థానానికి ఆరో దశ ఎన్నికల్లో భాగంగా మే 25న పోలింగ్ జరగనుంది.
కానీ బీజేపీ అభ్యర్థి సంబిట్ పాట్రా ఇప్పటి నుంచే ప్రచారంలో జోరు పెంచారు.
ఇవాళ పూరి నగరంలో ప్రచారంలో భాగంగా ఆయన ఓ వృద్ధురాలితో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఏడు దశల లోక్సభ ఎన్నికల ప్రక్రియలో ఇప్పటికే తొలి దశ, రెండో దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మే 7న పోలింగ్ జరగాల్సిన మూడో దశ ఎన్నిలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది.