- గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి 2008 డీఎస్సీ- అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని వినతిపత్రం ఇచ్చేందుకు జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసం వద్దకు వచ్చారు. తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం కామన్ మెరిట్లో ఎంపికై నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. గత ప్రభుత్వం పదేండ్లు తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వాపోయారు. ఆరు వారాల్లో పోస్టులను భర్తీ చేయాలని.. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్చేశారు.