నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా పల్నాటి సూర్య ప్రతాప్ రూపొందించిన చిత్రం ‘18 పేజెస్’. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మించాయి. డిసెంబర్ 23న సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. గెస్ట్గా వచ్చిన అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘నా హార్ట్కు ఎంతో దగ్గరైన సుకుమార్, నా క్లోజ్ ఫ్రెండ్ బన్నీ వాసు కలిసి నిర్మించిన సినిమా ఇది. మా నాన్నకు సొంత ఓటీటీ సంస్థ ఉన్నప్పటికీ, థియేటర్స్లో రిలీజ్ చేస్తూ ఆ కల్చర్ను సపోర్ట్ చేస్తున్నారు. నిఖిల్ స్క్రిప్ట్ సెలెక్షన్ నాకిష్టం. ‘కార్తికేయ 2’తో హిట్ అందుకున్న తనకు కంగ్రాట్స్. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్. సౌత్ సినిమాలను నార్త్ బాట పట్టించిన రాజమౌళి గారికి థ్యాంక్స్. ‘బాహుబలి’ తర్వాత పుష్ప, కేజీఎఫ్, కార్తికేయ 2, కాంతార చిత్రాలు సౌత్ నుండి నార్త్కు వెళ్లి దేశవ్యాప్తంగా ఆడాయి. ఇలా మన సౌత్ సినిమాలు అన్ని చోట్లా ఆడాలి. అది మనందరికీ ప్రౌడ్ మూమెంట్’ అన్నాడు. సుకుమార్ మాట్లాడుతూ ‘జగడం టైమ్లోనే ప్రొడ్యూసర్ అవుదామనుకున్నా. ‘హ్యాపీడేస్’ చూసి నిఖిల్కి లక్ష రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చా. ‘కార్తికేయ2’ తరహాలో నిఖిల్కి మరిన్ని సక్సెస్లు రావాలని కోరుకుంటున్నా. అనుపమతో ‘రంగస్థలం’ చేయాల్సింది. కానీ కుదరలేదు. త్వరలోనే కలిసి వర్క్ చేస్తాం. ఈ సినిమా సక్సెస్ అయితే క్రెడిట్ అంతా ప్రతాప్దే. ఇక ‘పుష్ప2’ ఐదు రోజులు షూట్ చేశాం. బన్నీ అద్భుతంగా నటిస్తున్నాడు. సినిమా ఏ స్థాయికి వెళ్తుందో చెప్పలేను’ అన్నారు.
నిఖిల్ మాట్లాడుతూ ‘2022 నాకు హ్యాపీ ఇయర్. కార్తికేయ2 హిట్ అవ్వడం, సుకుమార్ కథ రాసిన ‘18 పేజెస్’లో నటించడం, ప్రీ రిలీజ్కి అల్లు అర్జున్ రావడం ఫుల్ హ్యాపీ. ప్రతాప్ డెడికేషన్కి హ్యాట్సాఫ్. అనుపమతో మేజిక్ రిపీట్ అవబోతోంది. ఈ క్రేజీ లవ్స్టోరీ అందర్నీ సర్ప్రైజ్ చేస్తుంది’ అన్నాడు. ‘నాకిది స్పెషల్ మూమెంట్. నందిని లాంటి మంచి క్యారెక్టర్ రాసిన సుకుమార్ గారికి థ్యాంక్స్’ అంది అనుపమ. దర్శకుడు మాట్లాడుతూ ‘నా గత చిత్రం ‘కుమారి 21 ఎఫ్’కి గెస్ట్గా వచ్చి సపోర్ట్ చేశారు బన్నీ. అది హిట్టైనట్టే ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. సుకుమార్ అన్న నా లైఫ్కు చాలా ఇచ్చారు. గీతా ఆర్ట్స్లో వర్క్ చేసే చాన్స్ రావడం హ్యాపీ’ అన్నాడు. నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, ఎస్కెఎన్ సినిమాను సక్సెస్ చేయాలని ప్రేక్షకులను కోరారు. నటులు దినేష్, సరయూ, మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్, ఆర్ట్ డైరెక్టర్ రమణ తదితరులు పాల్గొన్నారు.