భారత్ లో 56 కు చేరిన కరోనా మరణాలు

భారత్ లో 56 కు చేరిన కరోనా మరణాలు

న్యూఢిల్లీ, ముంబై: దేశంలో కరోనా మహమ్మారి మరింతగా ప్రతాపం చూపుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లోనే 377 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఇంత ఎక్కువగా కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,024కు చేరింది. ఇక వైరస్ వల్ల దేశంలో మరో 7 మంది బలైపోయారు. మొత్తం మృతుల సంఖ్య 56కు చేరింది. ఇప్పటిదాకా 169 మాత్రమే కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం 1,788 మందికి ట్రీట్ మెంట్ కొనసాగుతోంది. మొత్తం 47,951 మందికి టెస్టులు చేశారు.

మహారాష్ట్రలో 335 కేసులు..

బుధవారం నాటికి అత్యధికంగా మహారాష్ట్రలో 335 కేసులు నమోదు అయ్యాయి. కేరళలో 265, కర్నాటకలో 110, యూపీలో 116, గుజరాత్ లో 87, మధ్యప్రదేశ్ లో 86, బెంగాల్ లో 37 కేసులు నమోదయ్యాయి. ఇక మహారాష్ట్రలో 13 మంది, తెలంగాణలో ఏడుగురు, గుజరాత్, మధ్యప్రదేశ్, బెంగాల్ లో ఆరుగురు చొప్పున, పంజాబ్ లో నలుగురు, కేరళ, ఢిల్లీ, యూపీ, జమ్మూకాశ్మీర్ లో ఇద్దరి చొప్పున, తమిళనాడు, బిహార్, హిమాచల్ ప్రదేశ్ లో ఒకరు చొప్పున చనిపోయారు.

తమిళనాడులో 110 ‘మర్కజ్’ కేసులు

తమిళనాడులో ఒక్కరోజే 110 కేసులు నమోదయ్యాయి. వీరంతా ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లొచ్చినవాళ్లేనని బుధవారం తమిళనాడు హెల్త్ సెక్రటరీ బీలా రాజేశ్ వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 234కు పెరిగాయని తెలిపారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో ఆరుగురు కోలుకోగా, ఒకరు మరణించారన్నారు.

దర్గాలో 100 మంది గుమిగూడిన్రు..

లాక్ డౌన్ ఉన్నా, రాజస్థాన్ లోని అజ్మీర్ జిల్లా సర్వార్ టౌన్ లో ఉన్న ఓ దర్గా వద్ద మంగళవారం దాదాపు 100 మంది గుంపులుగా మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. వెళ్లిపోవాలని చెప్పినా, వినకపోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఆరుగురిపై కేసు పెట్టామని పోలీసులు చెప్పారు.

ఢిల్లీలో ఇద్దరు డాక్టర్లకు కరోనా

ఢిల్లీలో ఇద్దరు డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. వీరిలో ఒకరు ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ హాస్పిటల్ లో కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ చేస్తున్న సీనియర్ డాక్టర్ కాగా మరో ఫిమేల్ డాక్టర్. మరోవైపు ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌‌కు కరోనా సోకింది. 32 మంది కానిస్టేబుళ్లను క్వారంటైన్ లో ఉంచారు.

ఎంసెట్ వాయిదా?..మిగతా సెట్స్ ది అదే పరిస్థితి