తెలుగు పారిశ్రామికవేత్తకు భారీ విదేశీ పెట్టుబడి .. కార్వ్ ఎఫ్‌‌జెడ్ -ఎల్‌‌ఎల్‌‌సీకి రూ.38 కోట్లు పెట్టుబడి

తెలుగు పారిశ్రామికవేత్తకు భారీ విదేశీ పెట్టుబడి .. కార్వ్ ఎఫ్‌‌జెడ్ -ఎల్‌‌ఎల్‌‌సీకి రూ.38 కోట్లు పెట్టుబడి

హైదరాబాద్​, వెలుగు: తెలుగు యువ పారిశ్రామికవేత్త రఘునాథ్  స్థాపించిన  కార్వ్​ ఎఫ్‌‌జెడ్ -ఎల్‌‌ఎల్‌‌సీకి నాలుగు మిలియన్ డాలర్ల (దాదాపు రూ.38 కోట్లు) అంతర్జాతీయ పెట్టుబడి కమిట్‌‌మెంట్ లభించింది. దుబాయ్‌‌లో నిర్వహించిన ఐసీఐఈ డీల్ రూమ్ కార్యక్రమంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రాస్ అల్ ఖైమా ఎకనామిక్ జోన్ (రాకెజ్)లో ఏర్పాటైన కార్వ్ సంస్థ హెల్త్​టెక్​ రంగం కోసం వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేస్తోంది. గత రెండేళ్లుగా తన వ్యాపార ఆలోచనను ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు ఐసీఏఐ చైర్మన్​సందీప్ మక్తల మార్గదర్శకత్వం తోడ్పడిందని రఘునాథ్​చెప్పారు.  సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వ సంస్థలను, పెట్టుబడిదారులతో భేటీ అయ్యాయని. నెల రోజుల్లోనే నాలుగు మిలియన్ డాలర్ల పెట్టుబడి సాధించానని తెలిపారు.